బాలయ్య డైలాగ్కి మహేష్ పంచ్ అదిరిందిగా!
on Jan 21, 2022
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో దేశవ్యాప్తంగా టాక్ షోలలో టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుని ఐఎండీబీలో 9.8 రేటింగ్ ని దక్కించుకున్న ఏకైక టాక్ షోగా రికార్డుని సాధించింది. గత కొన్ని వారాలుగా టాలీవుడ్ సెలబ్రిటీలని షోకు గెస్ట్ లుగా ఆహ్వానిస్తూ తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ.
ముందు బాలకృష్ణ హోస్ట్ అనగానే ఈ టాక్ షో పై భిన్న స్వరాలు వినిపించాయి. అయితే వాటన్నింటికీ షాకిస్తూ బాలకృష్ణ తనదైన స్టైల్లో గెస్ట్ లతో సరదా సంభాషణలతో వారిని ఎంటర్టైన్ చేస్తూ షోని రక్తికట్టించారు. ఈ షో తాజా సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో ఈ షో ముగియబోతోంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించేసిన ఆహా మేకర్స్ తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
Also Read: నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి
బాలకృష్ణ ఆడియన్స్ మధ్యలో కూర్చుని మహేష్ ని ఆహ్వానించడంతో ప్రోమో మొదలైంది. అసలు మహేష్ ఎవరంటే `నా పిల్లలకి నేను తండ్రిని' అని మహేష్ చెప్పడం... 'ఇద్దరిలో ఎవరు క్యాటు.. ఎవరు బ్రాటు' అని బాలయ్య ప్రశ్నిస్తే `గౌతమ్ క్యాట్ అని సితార బ్రాట్' అని... తాట తీసేస్తదని మహేష్ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇక 'మీ నాన్నగారు ఫుల్లు సెటైర్లు.. మరి నువ్వు కూడా... సెటైర్లకి బాప్ అని విన్నానే'.. అనగానే మహేష్ .. 'నాదుంటదండి.. నా టైమింగ్ వుంటదిగా'.. అని చెబుతుంటే `వస్తదిగా'...అని బాలయ్య అనడంతో అంతా నవ్వేశారు.
ఇక 'నమ్రత గారి గురించి చాలా బాగా చెప్పావ్.. తను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది' అని బాలయ్య అనగానే.. 'ఏం స్టేట్మెంట్ ఇచ్చింది... మంచి స్టేట్మెంటే ఇచ్చివుంటద'ని మహేష్ చెప్పడం.. 'ఏంటీ నమ్రత అనగానే డిసిప్లేన్ వచ్చేసింది బాడీలో' అని బాలయ్య అనడం.. 'ఇప్పుడు ఇంటికి వెళ్లాలి సార్.. ఇప్పుడు ఎందుకండీ ఇవన్నీ'.. అని మహేష్ అనడంతో బాలయ్య పెద్దగా నవ్వేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ గురించి అడిగే సరికి మహేష్ ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పాడు.
Also Read: వరుణ్తేజ్తో పెళ్లి వదంతులు.. ఫొటోతో ఆన్సర్ ఇచ్చిన లావణ్య!
ఒక రౌండ్ ఫుల్ గా అయిపోయి ఎండ్ కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ... ఏంటని దగ్గరికి వెళ్లగానే పాము పడగ విప్పింది... వెంటనే రివర్స్ ఐదు కిలోమీటర్లు పరుగెత్తి గేటు నుంచి బయటికి వెళ్లి మళ్లీ కేబీఆర్ పార్క్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని మహేష్ చెప్పడంతో నవ్వులు విరిసాయి. ప్రోమోనే ఇలా వుంటే ఎపిసోడ్ ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవచ్చు. ప్రోమో చివర్లో బాలయ్య దేవుడి గురించి డైలాగ్ చెప్పడం.. దానికి `ఏమ్మా దేవుడిని ఎవరైనా చూస్తారా?` అని మహేష్ పంచ్ వేయడం అదిరింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.